Maharashtra: ఫడ్నవీస్ రాజీనామా చేయాలి: శివసేన డిమాండ్

  • అసెంబ్లీ గడువు ముగుస్తోంది
  • తాత్కాలిక ప్రభుత్వ వెసులుబాటును బీజేపీ దుర్వినియోగం చేయకూడదు  
  • మా వైఖరితో మార్పుల్లేవు
  • తేల్చి చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మిత్రపక్షం శివసేన తమ పట్టును వీడడం లేదు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పదవిపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని తేల్చారు.

అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. సీఎం పదవి ఇచ్చేందుకు అంగీకరిస్తేనే బీజేపీ తమను సంప్రదించాలని సూచించారు. తాత్కాలిక ప్రభుత్వ వెసులుబాటును బీజేపీ దుర్వినియోగం చేయకూడదని ఆయన అన్నారు. కాగా, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శివసేన ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.

More Telugu News