Kurnool District: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన గూడూరు తహసీల్దార్‌

  • భూ సెటిల్‌మెంట్‌ విషయంలో రైతుతో బేరసారాలు
  • ఎనిమిది లక్షలు ఇవ్వాలని కండిషన్‌
  • రైతు నాలుగు లక్షలు ఇస్తుండగా పట్టుకున్న అధికారులు

ఓ రైతుకు సంబంధించి భూ లావాదేవీని ఆన్‌లైన్‌లో పరిష్కరించేందుకు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు...మండలానికి చెందిన ఓ రైతు భూమికి సంబంధించిన లావాదేవీ ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి ఉంది.

ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతు పలుమార్లు అధికారులను కలిశాడు. ఈ లావాదేవీ పూర్తి చేసేందుకు గూడురు తహసీల్దార్‌ హసినాబీ 8 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారన్నది రైతు ఆరోపణ. దీనికి రైతు అంగీకరించడంతో ముందుగా నాలుగు లక్షలు ఇవ్వాలని కండిషన్‌ విధించారు. ఈ మేరకు రైతు నుంచి తహసీల్దార్‌ నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

More Telugu News