Prakasam District: యువతి పైశాచికానందం... కలకలం రేపుతున్న ఒంగోలు రియల్ క్రైమ్!

  • స్పందన కార్యక్రమంలో ఎస్పీకి బాలిక ఫిర్యాదు
  • రంగంలోకి దిగి దాడులు చేసిన పోలీసులు
  • యువతి ప్రియుడు మృతి, ఇద్దరి అరెస్ట్

ఏ రియల్ క్రైమ్ స్టోరీ కూడా ఇంత హింస, ఇన్ని మలుపులతో ఉండదేమో! ఒంగోలులో ఓ యువతి పైశాచికానందం ఇప్పుడు పోలీసులనే విస్తుపోయేలా చేస్తోంది. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీగలాగిన పోలీసులు నమ్మలేని నిజాలను వెలుగులోకి తెచ్చారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే... ఆ అమ్మాయి పేరు సుమలత. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం స్వగ్రామం. గొంతు మగగొంతులా ఉంటుంది. ఆమెకు మరో పేరు కూడా ఉంది. అదే సాయి తేజా రెడ్డి.  భర్తను వదిలేసి ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంటుంది. ఆమెకు అమ్మాయిలతో శృంగారం చేయడం, 'సెక్స్ టాయ్స్'ను వాడుతూ పైశాచికానందం పొందడం అలవాటు. వారికి నరకం చూపిస్తూ ఆనందించేది.

మూడు నెలల క్రితం ఒంగోలు మారుతీనగర్ ప్రాంతానికి వచ్చి, అక్కడ సిమ్ కార్డులను అమ్మే వంశీ అనే యువకుడిని పరిచయం చేసుకున్న సుమలత, సిమ్ కార్డులను కొనే అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించడం ప్రారంభించింది. వారికి తాను యువకుడిననే భ్రమ కలిగేలా ఫోన్లు చేసి, వలపు వల విసిరేది. తన వలలో పడ్డారని భావించిన వారిని ఇంటికి రప్పించి, తన కోరికను తీర్చుకునేది. ఆపై ఆమె ప్రియుడు ఏడుకొండలు, వంశీ వారిపై అత్యాచారం చేసేవారు.

పెళ్లికాని పేద అమ్మాయిలు, చదువుకుంటున్న వారే సుమలత టార్గెట్. విషయం బయటకు చెబితే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో వారు బయటపడలేదు. అయితే, ఓ బాలిక మాత్రం నేరుగా స్పందన కార్యక్రమానికి వచ్చి, ఎస్పీకి విషయం చెప్పింది. 2వ తేదీన జరుగుమల్లికి వచ్చిన సుమలత, ఏడుకొండలు, తనను ఒంగోలుకు ఆటోలో తీసుకెళ్లారని, ఆపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందిచ్చి, సుమలతతో పాటు మరికొందరు కూడా అదే పని చేశారని వాపోయింది.

దీంతో ఎస్పీ స్వయంగా కల్పించుకుని, ఒంగోలు పోలీసులతో మాట్లాడారు. వెంటనే పోలీసులు సుమలత ఇంటిపై దాడి చేశారు. సుమలతతో పాటు పట్టుబడిన ఏడుకొండలు, వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పైనుంచి దూకి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో సుమలతతో పాటు ఆమెకు సహకరించిన వంశీని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వెల్లడించారు.

More Telugu News