India Map: భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ పై నేపాల్ అభ్యంతరం

  • కాలాపానీ ప్రాంతం భారత్ లో ఉన్నట్టు చూపించారు
  • భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం
  • సరిహద్దుల అంశంపై కూడా చర్చిస్తాం

ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశానికి చెందిన కాలాపానీ అనే ప్రాంతాన్ని భారత్ లో ఉన్నట్టు మ్యాప్ ను రూపొందించారని ఆరోపించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. ఇదే సమయంలో సరిహద్దులకు సంబంధించిన విషయంపై కూడా చర్చిస్తామని ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన నేపథ్యంలో, భారత ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News