Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పాం.. ఇచ్చిన మాట నెరవేర్చాం: జగన్

  • 3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నాం
  • రూ.10 వేలలోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు
  • రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తాం
  • పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా  నెరవేర్చుతున్నాం

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పామని, ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నానని చెప్పారు. గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో కొందరు అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన చెక్ లు అందజేశారు. అనంతరం  బహిరంగ సభలో మాట్లాడారు.

'3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నాం. రూ.10 వేలలోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తాం. నా పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకున్నాను. తొలి కేబినెట్ లోనే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం' అని జగన్ అన్నారు.

'గత ప్రభుత్వ పాలనలోనే అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది.. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మేము కేవలం ఐదు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదికి రూ.10 వేలిస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం' అని జగన్ వ్యాఖ్యానించారు.  

More Telugu News