shiv sena: మేమేం ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించట్లేదు: శివసేన నేత సంజయ్ రౌత్

  • శివసేన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారంటూ ప్రచారం 
  • ఖండించిన సంజయ్ రౌత్
  • ఆ అవసరం మాకు లేదు
  • మా నేతలు పార్టీకి కట్టుబడి స్పష్టమైన వైఖరితో ఉన్నారు

శివసేన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆ ప్రచారాన్ని ఖండించారు. 'మా ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాల్సిన అవసరం మాకు లేదు. మా నేతలు పార్టీకి కట్టుబడి స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తోన్న వారు ముందు వారి ఎమ్మెల్యేల తీరు గురించి ఆందోళన చెందాలి. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు' అని వ్యాఖ్యానించారు.

కాగా, మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ స్పందిస్తూ... 'తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తారని బీజేపీ మిత్ర పక్షం శివసేన భయపడుతోంది. అనైతిక చర్యలకు పాల్పడే వైఖరి బీజేపీ నేతలకు ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆ పార్టీ నుంచి మహారాష్ట్రను కాపాడాల్సిన అవసరం ఉందని కూడా దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు' అని ట్వీట్ చేశారు.

More Telugu News