Andhra Pradesh: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

  • వచ్చే నెల 12 నుంచి 23 వరకు జరగాల్సిన పరీక్షలు
  • సంక్రాంతి తర్వాత నిర్వహించే అవకాశం
  • పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఏపీపీఎస్సీ

రాష్ట్రంలో ఉన్నతస్థాయి ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి 23 వరకు జరగాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. అయితే, పరీక్షలు వాయిదా వేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News