Sundeep Kishan: 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు

  • వినోదమే ప్రధానంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'
  • ఈ నెల 15వ తేదీన భారీ విడుదల 
  • తదుపరి సినిమాగా  'A1 ఎక్స్ ప్రెస్'

సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించాడు. ఆయన జోడీగా హన్సిక నటించగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ నెల 9వ తేదీన కర్నూల్ లోని ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాపై సందీప్ కిషన్ ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి. ఇక సందీప్ కిషన్ తదుపరి చిత్రంగా 'A1 ఎక్స్ ప్రెస్' సెట్స్ పైకి వెళుతోంది. 'నట్పు తునై' అనే తమిళ హిట్ మూవీకి ఇది రీమేక్.

More Telugu News