Tamil Nadu: అశ్లీలంగా ఉన్న తల్లి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన తనయుడు

  • ఇంకా పిన్ని, బంధువుల ఫొటోలు కూడా
  • ఓ యువతి తన ఫొటో చూసి షాకై పోలీసులకు ఫిర్యాదు
  • దీంతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

కామపు పొరలు కమ్ముకున్నప్పుడు ఎదురుగా ఉన్నది తల్లి, చెల్లి అయినా, ఇతరులైనా ఒకేలా కనిపిస్తారనేందుకు ఓ యువకుడి చేష్టలు ఉదాహరణ. అశ్లీలంగా ఉన్న తన తల్లి ఫొటోనే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు పిన్ని, బంధువులు, ఇతర మహిళలు... ఇలా దాదాపు వంద మంది ఫోటోలు సోషల్‌ మీడియాలో ఉంచాడు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే...తమిళనాడులోని పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్‌ గయాస్‌ (27) పెరంబదూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.  చెన్నై  ట్రిప్లికేన్‌లో  ఇల్లు అద్దెకు తీసుకుని సుమతి అనే యువతితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.

ఈ కారణంగా సుమతితో కలిసి అప్పుడప్పుడు పలు కార్యక్రమాలకు హాజరయ్యేవాడు. ఆ కార్యక్రమాలకు అక్కడికి వచ్చే మహిళల అశ్లీల దృశ్యాలను చిత్రీకరించే వాడు. అలా తీసిన వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ యువతి ఫేస్‌బుక్‌ చూస్తుండగా అసభ్యంగా ఉన్న తన ఫొటో చూసి అవాక్కయ్యింది. దీంతో చెన్నై వెస్ట్‌జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు మహ్మద్‌ గయాస్‌పై అనుమానం వచ్చి అరెస్టు చేశారు. అతని సెల్‌ ఫోన్‌ తనిఖీ చేయగా 50 ఏళ్ల లోపున్న వంద మందికి పైగా మహిళల ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఉన్నాయి. అందులో అతని తల్లి, పిన్ని, బంధువుల ఫొటోలు, వీడియోలు కూడా ఉండడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. గయాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

More Telugu News