PV Sindhu: చైనా ఓపెన్... అనామకురాలి చేతిలో పీవీ సింధుకు ఘోర పరాభవం!

  • తొలి రౌండ్ లోనే పరాజయం
  • సింధును ఓడించిన పాయ్ యు
  • వరుస తప్పులు చేసిన సింధు

గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ పోటీల్లో వరుసగా వైఫల్యం చెందుతున్న తెలుగుతేజం పీవీ సింధు... మరోసారి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో ఓ అనామకురాలి చేతిలో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన సింధును, బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెద్దగా పరిచయం లేని చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి, 42వ ర్యాంక్ తో బరిలోకి దిగిన పాయ్ యు ఓడించింది.

తొలి రౌండ్ మ్యాచ్ లో 13-21, 21-18, 19-21 తేడాతో సింధును పాయ్ మట్టి కరిపించింది. తొలి సెట్ ను పాయ్ గెలుచుకున్నా, ఆపై పుంజుకున్న సింధూ, రెండో సెట్ ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సింధూ చేతులెత్తేయడంతో ఈ టోర్నీ నుంచి ఆమె వెనుదిరిగింది. దాదాపు గంటంబావు పాటు మ్యాచ్ సాగింది. మూడో సెట్ లో 15-12 ఆధిక్యంలో ఉన్న సింధు, ఆపై మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, వరుసగా తప్పులు చేసి ఓటమి చవిచూసింది.

More Telugu News