JC Travels: దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఐదు బస్సులు సీజ్

  • పర్మిట్లు లేకుండా నడిపిస్తున్నారన్న అధికారులు
  • జేసీ దివాకర్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
  • రాష్ట్రంలో 36 బస్సులు, మరో 18 కాంట్రాక్ట్ బస్సుల సీజ్  

సరైన పర్మిట్లు లేకుండానే బస్సులు నడుపుతున్నారన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ రోజు జరిపిన తనిఖీల్లో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఐదు బస్సులను సీజ్ చేశారు. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకుండానే ఈ బస్సులు నడిపిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం డీటీసీ శివరాం ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్ల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించి మొత్తం 36 బస్సులు, మరో 18 కాంట్రాక్ట్ బస్సులను సీజ్ చేశారు.

More Telugu News