Nithin: 'భీష్మ' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

  • విభిన్న ప్రేమకథా చిత్రంగా 'భీష్మ'
  • నితిన్ సరసన రష్మిక మందన 
  •  సంగీత దర్శకుడిగా మహతి సాగర్

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'బీష్మ' సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక నటిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండొచ్చుననే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లిమ్ప్స్ ను వదలనున్నారు. అందుకు 7వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.  మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ప్రేమకథా చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

More Telugu News