Rajani: 'దర్బార్' తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్న నిర్మాతలు

  • రజనీ మార్క్ చిత్రంగా 'దర్బార్'
  • తమిళనాట భారీ అంచనాలు 
  •  సంక్రాంతికి రెండు భాషల్లో విడుదల 

మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ 'దర్బార్' సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార నటించింది. ఈ క్రేజీ కాంబినేషన్ వలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

అందువలన తెలుగు హక్కుల కోసం దిల్ రాజు .. ఎన్వీ ప్రసాద్ .. యూవీ క్రియేషన్స్ వారు పోటీ పడుతున్నారట. ఇటీవల కాలంలో తెలుగులో విడుదలైన రజనీ సినిమాలు పెద్దగా ఆడలేదు. అందువలన సాధ్యమైనంత తక్కువ రేటుకే తెలుగు హక్కులను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారట. ఈ విషయంలో ఎవరి బేరసారాలు ఫలిస్తాయో చూడాలి మరి.

More Telugu News