Vijay Sai Reddy: మళ్లీ అవే ఏడుపులు, అదే టెన్షన్: విజయసాయి రెడ్డి

  • అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్
  • మిగతా విషయాలపై మాట్లాడే దమ్మే లేదు
  • పేరును చెప్పకుండా విజయసాయి విమర్శలు

తన అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్ తప్ప మిగతా విషయాల గురించి పట్టించుకోవడం లేదని, ఎవరి పేరునూ వెల్లడించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మళ్లీ అవే ఏడుపులు. అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, నవయుగకు అన్యాయం, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు. ఎంత సేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షనే తప్ప 4 లక్షల ఉద్యోగాల గురించి, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ములేదు" అని అన్నారు. 

More Telugu News