Revanth Reddy: అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలి: విజయారెడ్డి హత్యపై రేవంత్ రెడ్డి ట్వీట్

  • సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
  • విజయారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపిన రేవంత్

విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్ ను పట్టపగలు ఓ వ్యక్తి సజీవదహనం చేయడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి అగ్నికి ఆహుతి చేశాడు. అనంతరం సురేశ్ కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్లో స్పందించిన ఆయన, తహసీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.

More Telugu News