Bangladesh: అందుకే నిన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం: రోహిత్ శర్మ

  • ఫీల్డింగ్‌ వైఫల్యం కనపడింది
  • టీమిండియా సాధించిన స్కోరు స్పల్పమేమీ కాదు
  • ముష్పికర్‌ ను అవుట్ చేసే అవకాశాలు రెండుసార్లు వచ్చాయి
  • మిస్ చేసుకున్నాం

నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఫీల్డింగ్‌ వైఫల్యం వల్లే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సాధించిన స్కోరు స్పల్పమైందేమీ కాదని తెలిపాడు. మ్యాచ్‌ను గెలిచేందుకు వీలుండే లక్ష్యాన్నే బంగ్లాదేశ్ ముందుంచామని చెప్పుకొచ్చాడు.

బంగ్లా ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌ను అవుట్ చేసే అవకాశాలు తమకు రెండుసార్లు వచ్చినప్పటికీ వాటిని మిస్‌ చేసుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పటి నుంచీ ఒత్తిడికి గురయ్యామని, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రత్యర్థి జట్టు సద్వినియోగం చేసుకుందని చెప్పారు. అయితే, టీ20ల్లో యజ్వేంద్ర చహల్‌ మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌తో ముఖ్య పాత్ర పోషిస్తాడని ప్రశంసించాడు.

More Telugu News