Maharashtra: త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

  • అమిత్ షాతో ముగిసిన ఫడ్నవీస్ భేటీ
  • కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించను
  • కొత్త సర్కారు ఏర్పడుతుందన్న నమ్మకం నాకు ఉంది

మహారాష్ట్రలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు.

భేటీ అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ... కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో త్వరలోనే కొత్త సర్కారు ఏర్పడుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. కాగా, ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు తమ పార్టీల అధినేతలతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.

More Telugu News