Suryapet District: పల్టీ కొట్టిన పోలీసు వాహనం... తీవ్రంగా గాయపడ్డ ఎస్సై

  • సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తలకు తీవ్ర గాయాలు
  • హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలింపు

సూర్యాపేట జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. నాగారం, ఫణిగిరి మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మడవెల్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంగా... అక్కడకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను సూర్యాపేట్ జనరల్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు.

More Telugu News