Bigg Boss: బిగ్ బాస్-3 వేదికపై చిరంజీవి ఎంట్రీ... నాగ్ కు తెలియని విషయాలు చెప్పిన మెగాస్టార్

  • గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి
  • నాగ్ తో చమత్కారాలు
  • ఎంజాయ్ చేసిన ఆడియన్స్

బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యేంత వరకు జరిగిందంతా ఒకెత్తయితే, చివర్లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం మరో ఎత్తు. చిరంజీవి రాకతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఎంతో హుందాగా వేదికపై అడుగుపెట్టిన చిరంజీవి బిగ్ బాస్ షో గురించి చెబుతుంటే హోస్ట్ నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ ఎన్ని భాషల్లో ప్రసారమవుతుంది, ఎన్ని ఎపిసోడ్ లు జరిగాయో చిరు గణాంకాలతో సహా వివరించే సరికి, నాకు కూడా ఇన్ని విషయాలు తెలియవు అంటూ విస్మయం చెందారు.

అంతేకాదు, చిరు తనదైన శైలిలో వినోదం పండించారు. ఎప్పుడూ కోపగించుకోని నాగ్ బిగ్ బాస్-3 సందర్భంగా కోపం తెచ్చుకుంటున్నాడని విన్నానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కోపం కూకట్ పల్లిలో ఉంటే నాగార్జున నార్కెట్ పల్లిలో ఉంటారు అంటూ చమత్కరించారు. చిరు వేదికపై ఉన్నంత సేపు నవ్వులు ఓ రేంజ్ లో విరబూశాయి. మరికాసేపట్లో చిరంజీవి బిగ్ బాస్ విన్నర్ ను అనౌన్స్ చేస్తారు.

More Telugu News