India: బంగ్లాదేశ్ తో టి20 లో 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన భారత్

  • ఢిల్లీలో తొలి టి20 మ్యాచ్
  • స్వల్ప స్కోర్లకే అవుటైన రోహిత్, రాహుల్
  • టాస్ ఓడిన భారత్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ తో తొలి టి20 మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. బంగ్లా బౌలర్ల జోరుతో 36 పరుగులకే రెండు ప్రధానమైన వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓపెనర్ శిఖర్ ధావన్ కు తోడు శ్రేయాస్ అయ్యర్ కాసేపు పోరాడాడు. భారత్ స్కోరు 10 ఓవర్లలో 2 వికెట్లకు 69 పరుగులు కాగా, ఆ తర్వాత  అయ్యర్ అవుటయ్యాడు. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లామ్ 1, అమినుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. ప్రసుత్తం భారత్ స్కోరు 11 ఓవర్లలో 3 వికెట్లకు 73 పరుగులు. ధావన్ కు తోడుగా పంత్ ఆడుతున్నాడు.

More Telugu News