Whatsapp: సరికొత్త ఫీచర్లతో సందడి చేయనున్న వాట్సాప్

  • వాట్సాప్ నుంచి పేమెంట్స్ ఫీచర్
  • ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న వాట్సాప్
  • గ్రూప్ బ్లాక్ లిస్ట్ సాయంతో బ్లాక్ చేసే సదుపాయం

ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవల కోసం వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను త్వరలోనే ప్రకటిస్తారు. కొన్ని నెలల కిందటే ఈ ఫీచర్ ను పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు యూజర్లకు ప్రయోగాత్మకంగా విడుదల చేశారు. దీన్ని మరింత అభివృద్ధి పరిచి త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఈ ప్రక్రియకు ముందే వాట్సాప్ ఆర్బీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్ లో కూడా మరో ఫీచర్ జోడిస్తున్నారు. గ్రూప్ లో చేరాల్సిందిగా అభ్యర్థన పంపేవారిని బ్లాక్ లిస్ట్ సాయంతో బ్లాక్ చేయొచ్చు. ఈ గ్రూప్ బ్లాక్ లిస్ట్ ఫీచర్ ను మొదట ఐఫోన్ యూజర్లకు విడుదల చేస్తారు.

ముఖ్యంగా, ఒకేసారి అనేక డివైస్ లలో లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించే ఫీచర్ ను వాట్సాప్ త్వరలోనే ఆవిష్కరించనుంది. ఇప్పటివరకు ఒక డివైస్ లో వాట్సాప్ లాగిన్ అయ్యున్నప్పుడు మరో డివైస్ లో లాగిన్ అయితే, ముందు లాగిన్ అయిన డివైస్ లో వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న సరికొత్త ఫీచర్ ద్వారా ఒకరు ఎన్ని డివైస్ లలో అయినా వాట్సాప్ ను యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. అంతేకాదు, ఐపాడ్ లలోనూ వాట్సాప్ అందుబాటులోకి రానుంది.

More Telugu News