Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి ప్రాణాలు తీసిన అతి వేగం

  • జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద ప్రమాదం
  • ప్రమాదంలో మరి కొందరికి గాయాలు
  • హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తూ అదుపుతప్పిన కారు

కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఓ కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారుపై అది పడింది.

వాటిల్లో ఒక కారులోని ప్రయాణికులు మహబూబ్‌నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వివరించారు. కార్లు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

More Telugu News