Siddipet District: ఆలస్యంగా వచ్చినందుకు.. తనకు తాను జరిమానా విధించుకున్న మంత్రి హరీశ్ రావు!

  • తనకు తాను రూ.50 లక్షల ఫైన్‌ వేసుకున్న అమాత్యుడు
  • సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కార్యక్రమం
  • ఆ నిధులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని హామీ

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు రూ.50 లక్షల జరిమానా పడింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఈరోజు ఉదయం జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ఆయన ఆలస్యంగా రావడంతో ఈ జరిమానా విధించారు. అయితే ఈ పైన్‌ ఎవరో వేసింది కాదు. అమాత్యుల వారు తాను ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తూ తనకు తాను విధించుకున్నారు. ఈ రూ.50 లక్షల నిధులు త్వరలోనే విడుదల చేసి వీటితో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని సభాముఖంగా తెలిపారు.  స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.

More Telugu News