BJP laxman: లక్ష్మణ్ నివాసంలో కీలక భేటీ...హాజరైన కోదండరాం, అశ్వత్థామరెడ్డి

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చనీయాంశం
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • మంత్రి మండలి భేటీ అంశం ప్రస్తావన

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నెలరోజులకు సమీపిస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘం నాయకులు మొండిగా వ్యవహరిస్తుండడంతో సమ్మె పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు కార్మికుల్లోనూ ఆందోళన కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు కీలక నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వగృహంలో జరిగిన భేటీకి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రి మండలి సమావేశంలో ఆర్టీసీ అంశంపై జరిగిన చర్చ, సమ్మె భవిష్యత్తు కార్యాచరణ, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

More Telugu News