Tirupati: తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో 'జన ఔషధి' దుకాణాన్ని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి

  • సామాన్యులకు అందుబాటులో నాణ్యమైన ఔషధాలు
  • కేంద్రం నిర్ణయంతో 'జన ఔషధి' దుకాణాల ఏర్పాటు
  • స్విమ్స్ లోనూ దుకాణం ఏర్పాటు

కేంద్రం సామాన్యులకు కూడా నాణ్యమైన ఔషధాలు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అందుకోసమే ప్రత్యేకంగా 'ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి' దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలోనూ 'జన ఔషధి' మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విషయాలను వైవీనే ట్విట్టర్ లో వెల్లడించారు. రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలనంతో అమ్మకాలు షురూ చేశారు.

More Telugu News