India: భారత జాతీయగీతం ఆలపిస్తుంటే కుర్చీలోంచి లేవని ఏంజెలా మెర్కెల్... అసలు కారణం వెల్లడించిన జర్మన్ ఎంబసీ

  • భారత్ లో పర్యటిస్తున్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్
  • మెర్కెల్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం
  • చర్చనీయాంశంగా మారిన మెర్కెల్ చర్య

జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మెర్కెల్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఏంజెలా మెర్కెల్ కుర్చీలోంచి లేవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జర్మన్ ఎంబసీ వివరణ ఇచ్చింది. మెర్కెల్ కు మోకాళ్ల సమస్య ఉందని, ఆమె ఒక్కసారిగా లేచి నిలబడే పరిస్థితిలో లేరని జర్మన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని తాము భారత రాష్ట్రపతి భవన్ వర్గాలకు ముందుగానే తెలియజేశామని స్పష్టం చేశారు.

More Telugu News