K.Viswanath: గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన కళాతపస్వి కె.విశ్వనాథ్... కేసీఆర్, సంతోష్ లపై ప్రశంసల జల్లు

  • హరితహారం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • తన ఇంట్లోనూ ఓ మొక్క నాటిన కె.విశ్వనాథ్
  • పర్యావరణం కోసం కృషి చేస్తున్నారంటూ కేసీఆర్, సంతోష్ లకు అభినందన

తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో తన వంతుగా ఓ మొక్క నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన ఆయన ఫిలింనగర్ లోని తన నివాసంలో ఓ కదంబ మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ లను అభినందించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ ఇద్దరూ విశేష కృషి చేస్తున్నారని, ముఖ్యంగా సంతోష్ ఈ కార్యక్రమాన్ని ఓ భగీరథ ప్రయత్నంలా సాగిస్తున్నారని కొనియాడారు. పర్యావరణం నానాటికీ దెబ్బతింటున్న ఈ రోజుల్లో హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమం అని కె.విశ్వనాథ్ ప్రశంసించారు.

More Telugu News