BJP: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఏపీకి రానున్న జేపీ నడ్డా

  • నవంబరు 10న రాష్ట్రానికి రాక
  • బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి హాజరు
  • కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఏపీలో పర్యటించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత నడ్డా రాష్ట్రానికి రానుండడం ఇదే ప్రథమం. ఆయన నవంబరు 10న రాష్ట్రానికి వస్తున్నారని, 'బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం'లో పాల్గొంటారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్లో వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవాడలో జరగనుంది.

More Telugu News