కర్తార్ పూర్ కు వచ్చే యాత్రికులకు పాస్ పోర్ట్ అవసరం లేదు.. ఐడీ చాలు: ఇమ్రాన్ ఖాన్

- ఈ నెల 9న కర్తార్ పూర్ నడవా ప్రారంభం
- భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే చాలు
- ప్రారంభోత్సవం రోజున రుసుము కూడా లేదు
సిక్కు మత గురువు గురునానక్ గురుద్వారాను 1522 లో స్థాపించారు. పంజాబ్ గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ ప్రార్థనాలయాన్ని పాకిస్థాన్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలుపుతూ కర్తార్ పూర్ నడవా నిర్మించారు. ఈ నడవాను నవంబర్ 9న ప్రారంభిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించారు. భారత్ నుంచి వచ్చే యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలని పాక్ భావిస్తోంది.