Terrorists: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. బీజేపీ నేత వాహనానికి నిప్పు

  • రెండు వాహనాలకు నిప్పు పెట్టిన ముష్కరులు
  • ఇందులో ఒకటి బీజేపీ నేత వాహనం
  • కుల్గాం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలోని బోనిగామ్ గ్రామంలో రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఈ తెల్లవారుజామున 1.20  గంటల సమయంలో జరిగింది. ఈ వాహనాల్లో ఒకటి కుల్గాం జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీది కావడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం... బీజేపీ నేత ఆదిల్ అహ్మద్ నివాసం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ముష్కరులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనించదగ్గ అంశం.

More Telugu News