Vijay Sai Reddy: అందుకే ప్యాకేజీ స్టార్ ను మళ్లీ తీసుకువచ్చారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన విజయసాయి
  • చంద్రబాబుకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదని ఎద్దేవా
  • టీడీపీ పనైపోయిందన్న విషయం చంద్రబాబుకు అర్థమైందని వ్యాఖ్యలు

వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడనే విషయం అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబుకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్థమైందని, అందుకే ప్యాకేజీ స్టార్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. టీడీపీ పని ఇక ఖాళీ అని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలో దిక్కుకు వెళుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని, ప్యాకేజీ స్టార్ ను రంగంలో దింపడం వెనుక మతలబు అదేనని ఎద్దేవా చేశారు.

More Telugu News