Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే.. దూసుకుపోయిన యస్ బ్యాంక్

  • 77 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 33 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 24 శాతం ఎగబాకిన యస్ బ్యాంక్

దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 40,129కి చేరుకుంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 11,877 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎస్ బ్యాంక్ (24.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.69%), ఇన్ఫోసిస్ (3.79%), టాటా మోటార్స్ (3.40%), భారతి ఎయిర్ టెల్ (1.63%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.09%), యాక్సిస్ బ్యాంక్ (-2.04%), టాటా స్టీల్ (-1.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.77%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.74%).

More Telugu News