TTD: జీవో 2323తో తిరుమలలో డాలర్‌ శేషాద్రికి ఉద్వాసన?

  • రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవోతో వేటు పడే అవకాశం
  • 2323 నంబరు జీవోతో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు
  • ఈ రాత్రికే 60 మంది తొలగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పగానే ఎవరికైనా డాలర్‌ శేషాద్రి పేరు గుర్తుకు వస్తుంది. సుదీర్ఘకాలం నుంచి స్వామి వారి సేవలో తరిస్తున్న ఆయనపై ప్రశంసలు, విమర్శలు రెండూ ఉన్నాయి. టీటీడీలో పదేళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన డాలర్‌ శేషాద్రి ఇప్పటికీ స్వామి వారి సేవలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2323 నంబరు జీవోతో ఆయనపై కూడా వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే సుదీర్ఘకాలం నుంచి ఉన్న డాలర్‌ శేషాద్రి సేవలకు ముగింపు పలికినట్టే.

వివరాల్లోకి వెళితే...రాష్ట్ర ప్రభుత్వం తాజా జీఓ మేరకు ఈ ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసి కొనసాగింపులో ఉన్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని  ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు.

ఇలా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి నివేదిక ఇవ్వాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం ఈరోజు రాత్రిలోపు 60 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో డాలర్‌ శేషాద్రితోపాటు, టీటీడీ ఇటీవల చేసిన 12 మంది ఉద్యోగాల నియామకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.

More Telugu News