KTR: రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ.. రెండు లేఖల అందజేత

  • ఢిల్లీ పర్యటనలో కేటీఆర్
  • రహదారుల అభివృద్ది కోసం రక్షణ భూముల అప్పగింతపై లేఖలు
  • ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్

ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. అలాగే, 44, 1వ నంబరు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రక్షణ భూముల అప్పగింత వ్యవహారంపై రెండు లేఖలను రక్షణ మంత్రికి కేటీఆర్ అందించారు. అనంతరం ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.

More Telugu News