Kathi: 'ఖైదీ'కి సీక్వెల్ ఖాయమన్న కార్తీ

  • దీపావళి కానుకగా వచ్చిన 'ఖైదీ' 
  • తమిళ .. తెలుగు భాషల్లో హిట్ 
  •  రవితేజ కాల్ చేశాడన్న కార్తీ  

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. చాలాకాలం తరువాత ఈ సినిమా కార్తీకి హిట్ తెచ్చిపెట్టింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కార్తీ మాట్లాడుతూ .. "తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది. టీమ్ అంతా కూడా ఈ సినిమా కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సందడి పూర్తయిన తరువాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ .. నేను కూర్చుని సీక్వెల్ ప్లాన్ చేస్తాము. ఇక ఈ సినిమా చూసి హీరో రవితేజ నాకు కాల్ చేసి అభినందించారు. కంటెంట్ ఆయనకి చాలా బాగా నచ్చిందట. ఈ తరహా కథను చేస్తానని ఆయన అనడం కూడా నాకు సంతోషాన్ని కలిగించింది" అని అన్నారు.

More Telugu News