India: ప్రవాస భారతీయుల ఇళ్లే ఆమె టార్గెట్‌!

  • అమెరికాలో ఓ దొంగల ముఠాకు ఆమె చీఫ్
  • టెక్సాస్ లో ప్రవాస భారతీయుల ఇళ్లలోకి ప్రవేశించి చోరీలు
  • 37 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ఆమె పేరు చాకా కాస్ట్రో(44).. అమెరికాలో ఓ దొంగల ముఠాకు ఆమె చీఫ్. టెక్సాస్ లో ప్రవాస భారతీయుల ఇళ్లలోకి ప్రవేశించి దోచుకోవడమే ఆమె లక్ష్యం. ఇందుకోసం తన ముఠా సభ్యులను పంపి ముందుగా రెక్కీ నిర్వహిస్తుంది. అనంతరం స్కెచ్ వేసి, పక్కా ప్రణాళిక ప్రకారం దోచుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చివరకు పోలీసులకు చిక్కింది.

తాజాగా, చాకా కాస్ట్రోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం ఏకంగా 37 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాస్ట్రో సూచనల మేరకు ఆమె ముఠా సభ్యులు ప్రవాస భారతీయుల ఇళ్లకు వెళ్లి చోరీలు చేసేవారని న్యాయస్థానంలో తేలడంతో ఈ శిక్ష పడింది.

More Telugu News