Telangana: ఐదేళ్లుగా ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపండి.. కేసీఆర్, కేటీఆర్ కు ఉత్తరాలు రాసిన చిన్నారులు

  • హైదరాబాద్ లోని అలకాపూర్ టౌన్ షిప్ చిన్నారుల నిరసన
  • తాము తాగేందుకు మంచి నీరు అందట్లేదని పేర్కొన్న చిన్నారులు
  • పోస్టు కార్డుల ద్వారా తమ బాధ చెప్పుకున్న చిన్నారులు

ఐదేళ్లుగా తమ కాలనీలో ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కొందరు చిన్నారులు ఉత్తరాలు రాశారు. తాము హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న అలకాపూర్ టౌన్ షిప్ లో నివసిస్తున్నామని ఆ చిన్నారులు వాటిల్లో పేర్కొన్నారు.  

స్వచ్ఛమైన నీళ్లని పొందడం మానవుడి ప్రాథమిక హక్కని, కానీ, తాము తాగేందుకు మంచి నీరు అందట్లేదని వారు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డుకి కూడా వారు పోస్టు కార్డులు పంపారు. ఈ రోజు ఉదయం స్వామి వివేకానంద పార్కుకి తమ తల్లిదండ్రులతో కలిసి చేరుకున్న ఆ చిన్నారులు ఈ విధంగా తమ నిరసనను తెలిపారు. 

More Telugu News