Balakrishna: బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్

  • డిసెంబర్ 20న రానున్న 'రూలర్'
  • త్వరలో బోయపాటితో సెట్స్ పైకి 
  • యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా సాగే కథ 

ప్రస్తుతం బాలకృష్ణ .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే 'జెర్సీ'.. 'జోడీ' సినిమాల ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

More Telugu News