Tihar: తీహార్ జైల్లో చిదంబరంకు అస్వస్థత... ఎయిమ్స్ కు తరలింపు

  • వీఐపీ రూమ్ లో చిదంబరంకు చికిత్స
  • వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన చిదంబరంను వెంటనే జైలు వర్గాలు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించాయి. చిదంబరంను ఎయిమ్స్ వైద్యులు వీఐపీ ప్రైవేటు రూమ్ లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న చిదంబరంను ఇటీవలే ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది.

More Telugu News