Tharun Bhaskar: విడుదలకి సిద్ధమైన 'మీకు మాత్రమే చెప్తా'

  • హీరోగా కొత్త లుక్ తో తరుణ్ భాస్కర్  
  • నిర్మాతగా విజయ్ దేవరకొండ ప్రయోగం 
  •  తెలుగు తెరకి వాణి భోజన్ పరిచయం 

విజయ్ దేవరకొండ నిర్మాతగా ఆయన సొంత బ్యానర్ నుంచి తొలి సినిమాగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. షమ్మీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషమైతే, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా చేయడం మరో విశేషం. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

More Telugu News