Vanisri: ఎన్టీఆర్ సెట్లో ఉండగానే వాణిశ్రీ కోపంతో షూటింగు నుంచి వెళ్లిపోయారట

  • వాణిశ్రీ గారికి ధైర్యం ఎక్కువ 
  • ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెబుతారు 
  • అప్పుడు ఆమెకి కోపం వచ్చిందన్న ఈశ్వర్

సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ .. వాణిశ్రీగారి గురించి మాట్లాడుతూ, 'ఎదురులేని మనిషి' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ కథానాయకుడిగా బాపయ్య గారి దర్శకత్వంలో 'ఎదురులేని మనిషి' షూటింగు జరుగుతోంది. ఆ రోజున ఎన్టీఆర్ - వాణిశ్రీపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

కొరియోగ్రఫర్ శ్రీనివాస్ ఒక మూమెంట్ ను కంపోజ్ చేశాడు. అది కొంచెం వల్గర్ గా ఉండటంతో వాణిశ్రీ అసహనానికి లోనయ్యారు. ఆ మూమెంట్ బాగోలేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసినా, అక్కడి వారెవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. దాంతో తను ఈ సినిమా చేయడం లేదంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. సెట్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటికీ ఆమె అలా చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తరువాత ఆ మూమెంట్ ను మార్చేసి .. వాణిశ్రీని కూల్ చేసి షూటింగును పూర్తి చేశారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News