Rahul Gandhi: ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను: రాహుల్ గాంధీ

  • మూడు రోజులుగా బోరుబావిలోనే సుజిత్
  • 88 అడుగుల లోతుకు జారిపోయిన బాలుడు 
  • క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ఎదురుచూస్తోందన్న రాహుల్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టిలో సుజిత్ విల్సన్‌ అనే మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా అతడు అందులోనే ఉన్నాడు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకొంటుంటే, ఆ రాష్ట్రం మాత్రం సుజిత్ కోసం ఎదురు చూస్తోందని, ఆ బాలుడిని రక్షించుకోవాలన్న ప్రయత్నంలో ఉందని ట్వీట్ చేశారు.

ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ శుక్రవారం బోరుబావిలో పడిపోయాడని తనకు తెలిసిందని రాహుల్ చెప్పారు. అతడు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బాలుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, బోరుబావిలో ఆ బాలుడు 88 అడుగుల లోతుకు జారిపోయాడు.

More Telugu News