Illegal Affair: అక్రమ సంబంధానికి అడ్డు చెప్పిన తల్లి.. ప్రియుడితో కలిసి మట్టుబెట్టిన తనయ!

  • మూడు రోజుల పాటు ఇంట్లోనే తల్లి శవాన్ని దాచిన కూతురు
  • దుర్వాసన వస్తుందనే భావనతో రామన్నపేట రైల్వే ట్రాక్ వద్ద శవాన్ని పడేసిన వైనం
  • తండ్రి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకోలు

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుతగులుతోందన్న కసితో కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. వివరాల్లోకి వెళ్తే, ఈడొచ్చిన తన కుమార్తెకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని భావించిన తల్లికి... కుమార్తె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందనే విషయం తెలిసి షాక్ తగిలింది. చేస్తున్న పని చాలా తప్పు అని కూతురుని రెండు, మూడు సార్లు మందలించింది. అయినా, తన తీరు మార్చుకోని కూతురు... ఏకంగా తన తల్లినే హతమార్చింది. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

తన ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కూతురు... మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే దాచింది. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తే పక్కనున్న వారికి తెలిసిపోతుందనే భావనతో... తన ప్రియుడితో కలసి తల్లి శవాన్ని నల్గొండ జిల్లా రామన్నపేట రైల్వే ట్రాక్ వద్ద పడేసి వచ్చింది.

ఆ తర్వాత అమ్మ ఎక్కడ అంటూ తండ్రి గట్టిగా నిలదీయడంతో... తానే చంపినట్టు ఆమె ఒప్పుకుంది. దీంతో, పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ఆమె పరారీలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హంతకుల కోసం వేట మొదలుపెట్టారు.

More Telugu News