Kadapa District: కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

  • చక్రాయపాలెం మండలం కుమారకాల్వలో ఘటన
  • క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించిన పోలీసులు
  • గ్రామంలో పికెట్ ఏర్పాటు

కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. చక్రాయపాలెం మండలం కుమారకాల్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కొడవళ్లతో దాడికి దిగాయి. ఈ ఘటనలో గాయపడిన 11 మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ వెనక కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News