KCR: ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

  • ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశం
  • హాజరైన మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఎండీ
  • చర్చల వివరాలు సీఎంకు తెలిపిన అధికారులు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 23వ రోజుకు చేరింది. అటు సర్కారు నుంచి కానీ, ఇటు ఆర్టీసీ కార్మికుల నుంచి కానీ ఎలాంటి చొరవ కనిపించకపోవడంతో నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. అంతేకాకుండా, కోర్టులో సమ్మెపై వినిపించాల్సిన వాదనలను కూడా సీఎంతో చర్చించారు.

More Telugu News