Telangana: తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసిన కార్మిక సంఘాల నేతలు

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • చర్చకు తాము సిద్ధమేనన్న జేఏసీ
  • సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మూడు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మె కారణంగా తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల జేఏసీకి మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ప్రతిష్టంభన తొలగిపోలేదు. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు లేఖ రాసింది. అన్ని డిమాండ్లపై మరోసారి చర్చకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ వ్యవహారంపై మరోసారి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News