Anantapur District: టీడీపీ నేత ఇంటి చుట్టూ వైసీపీ నేత బండలు పాతిన వైనం!

  • టీడీపీ నేత నాగరాజు, వైసీపీ నేత పెద్దిరెడ్డి మధ్య వివాదం
  • నాగరాజు ఇంటి చుట్టూ బండలు
  • బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

టీడీపీ నేత నాగరాజు ఇంటి చుట్టూ వైసీపీ నేత పెద్దిరెడ్డి బండలు పాతడం కలకలం రేపింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో నాగరాజు నివాసం ఉంటారు. ఆ ప్రాంతలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రహదారి వివాదం ఏర్పడింది. స్థల వివాదం నేపథ్యంలో నాగరాజు ఇంటికి అడ్డుగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి ఈ బండలు పాతించారు. దీంతో బయటి నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

దీనిపై పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలి చేరుకుని పరిశీలించారు. మరోవైపు, టీడీపీ నేత స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News