Andhra Pradesh: ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం కొత్త పథకం

  • డిసెంబర్ 1 నుంచి ‘పోస్ట్ ఆపరేటివ్ సస్టెయినెన్స్ అలవెన్స్ ఫథకం’  
  • ఆపరేషన్ తర్వాత రోగికి అలవెన్సుగా రోజుకు రూ.225  
  • నెలకు గరిష్టంగా రూ.5వేలు అందజేత

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు చెందిన రోగులు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేసుకున్న ప్రతీ పేద రోగికి భత్యం కింద రోజుకు రూ. 225 అందజేస్తారు. ‘పోస్ట్ ఆపరేటివ్ సస్టెయినెన్స్ అలవెన్స్’గా పిలుస్తున్న ఈ పథకంలో నెలకు గరిష్ఠంగా ఒక రోగికి రూ.5 వేల వరకు ఇస్తారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమలు కానున్న ఈ పథకానికి  నిధులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి చెల్లించనున్నట్లు  పేర్కొంది.

More Telugu News