DK Shivakumar: డీకే శివకుమార్ కు బెంగళూరులో ఘన స్వాగతం

  • మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ కు బెయిలు
  • ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న డీకే
  • ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈనెల 23న శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది.

గత నెల 3న శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు తీర్పు మేరకు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. శివకుమార్ కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. రూ. 25 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News