Telangana: వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపాను.. హెచ్చరికలు జారీ

  • అరేబియా సముద్రంలో అల్పపీడనం
  • వచ్చే 12 గంటల్లో తుపానుగా మారనున్న వైనం
  • తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 12 గంటల్లో తుపానుగా మారుతుందని, ఆపై అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

More Telugu News